Posted on 2023-10-13 06:09:43
డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆదేశాల మేరకు ఎస్ పి ఆధ్వర్యంలో గంజాయి ద్వoసం
డైలీ భారత్, ములుగు జిల్లా: రోజు రోజుకు పెరిగి పోతున్న గంజాయి విక్రయాన్ని అడ్డుకట్ట వేసే దిశగా ములుగు జిల్లాలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు. డ్రగ్ డీస్-పోసల్ కమిటీ ఆదేశాల ప్రకారం ములుగు పస్రా ఏటూర్ నాగారం మంగపేట వెంకటాపురం పరిధిలో సీజ్ చేసినటువంటి 757 కిలోల 625 గ్రాముల గంజాయిని గురువారం జిల్లా ఎస్పీ గాష్ ఆలం ఐ పి ఎస్ ఓ ఎస్ డి అశోక్ కుమార్ ఐ పి ఎస్ ఏ ఎస్ పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్ ఐ పి ఎస్ ఆధ్వర్యంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ధ్వంసం చేయనైనది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కొందరు అక్రమార్జన లో భాగంగా గంజాయిని విక్రాయిస్తూ పట్టణ మరియు గ్రామాలలోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ గంజాయి మత్తులోకి దించుతున్నందున వారిని అరికట్టడం కోసం జిల్లాలోని పోలీస్ అధికారులచే ఒక రహస్య బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి గానీ ఇతర మత్తు పదార్థాలు గానీ విక్రయిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. తమ పరిసరాలలో గంజాయిని విక్రయిస్తున్నట్టు అనుమానా స్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీస్ లకు సమాచారం అందించి వారి పిల్లల బంగారు భవిష్యత్తు కాపాడు కోవాల్సిందిగా ఎస్ పి కోరారు .ఈ కార్యక్రమంలో డ్రగ్ డీస్ పోసల్ కమిటీ సభ్యులు (4సభ్యులు )ఎస్ పి గౌష్ ఆలం ఐ పి ఎస్ , ఓ ఎస్ డి అశోక్ కుమార్ ఐ పి ఎస్ , ఏ ఎస్ పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్ ఐ పి ఎస్, సి సి ఎస్ మరియు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ దయాకర్ లు మరియు రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్ సతీష్, ఆర్ ఐ వెంకటనారాయణ ఎస్ ఐ కమలాకర్ పాల్గొన్నారు.
రాజ్భవన్లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >