| Daily భారత్
Logo


పలకతో కొట్టిన టీచర్, యూకేజీ విద్యార్థి మృతి

News

Posted on 2023-10-02 21:39:23

Share: Share


పలకతో కొట్టిన టీచర్, యూకేజీ విద్యార్థి మృతి

డైలీ భారత్, హైదరాబాద్: నగరంలోని రామాంతపూర్ వివేక్ నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ వివేక్‌నగర్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్న విద్యార్థి హేమంత్ టీచర్ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. శనివారంనాడు హోంవర్క్ చేయలేదని స్కూల్ టీచర్ చిన్నారి తలపై పలకతో కొట్టడంతో అతడు ఆదివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ మేరకు చిన్నారి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తూ పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. విద్యార్థి మృతదేహంతో ధర్నా చేపట్టారు. పోలీసులు, పాఠశాల యాజమాన్యం స్పందించడంతో ఆందోళన విరమించారు. చిన్నారి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం వనపర్తికి తరలించారు.

గత వారం రోజులుగా హేమంత్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని ఉప్పల్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే టీచర్ కొట్టడంతో మరింత అస్వస్థతకు గురైన చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది.

Image 1

ఘోర రోడ్డు ప్రమాదం

Readmore >
Image 1

భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్

Readmore >
Image 1

ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్‌ రైటర్

Readmore >
Image 1

ప్రేమజంట ఆత్మహత్య?

Readmore >
Image 1

ఇంటి పెద్దను హతమార్చిన భార్య, కూతురు

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

Readmore >
Image 1

అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్

Readmore >