Posted on 2024-03-28 16:19:45
డైలీ భారత్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలోని పాపన్న పేట మండలం బాచారం గ్రామానికి చెందిన సుంద పోచయ్య-శ్యామమ్మ కుమారుడు రాములుకు, సంగారెడ్డి జిల్లా అందోల్కు చెందిన పూజారి యాదయ్య కుమార్తెతో గురువారం పెళ్లి జరగాల్సి ఉంది.
ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం బంధువులంతా వచ్చేశారు. ఇంట్లో పెళ్లి సందడి నెలకొనగా.. వారి ఆచారం ప్రకారం పతానం కార్యక్రమం జరిపేందుకు అంతా సిద్ధమయ్యారు.
పెళ్లి కొడుకును వధువు ఇంటికి తీసుకువచ్చేందుకు సుమారు 30 మంది పెళ్ళికొడుకు తరఫు బంధువులు ట్రాక్టర్లో పెళ్లి కూతురు గ్రామానికి బయ లుదేరారు.
కాగా మార్గమధ్యలో సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం మన్సాన్పల్లి శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటు చేసు కుంది. అతి వేగంతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా కొట్టడంతో బాచారం గ్రామానికి చెందిన రావుగారి బూదమ్మ, జెట్టిగారి సంగ మ్మ,స్పాట్ లోనే చనిపోగా, ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న రావుగారి ఆగమ్మ చనిపోయారు.
చిన్నారుల తో సహా మరో 25 మంది గాయపడ్డారు. ఒకరిద్దరి పరిస్థితి విష మంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రెండేళ్ల చిన్నారితో సహా పలువురు చిన్నారులూ గాయపడటం తో ఆ ప్రాంతం అంతా రోదనలతో నిండిపోయింది.
పెండ్లి కుమారుని అమ్మమ్మ, చిన్నమ్మకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. బంధువులు ప్రమాదంలో చనిపోవడంతో నేడు జరగాల్సిన పెళ్లి ఆగిపో యింది.
మరో వైపు పెళ్లి ఆగిందన్న మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుము కున్నాయి.
ఘోర రోడ్డు ప్రమాదం
Readmore >భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్
Readmore >ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్ రైటర్
Readmore >ప్రేమజంట ఆత్మహత్య?
Readmore >ఇంటి పెద్దను హతమార్చిన భార్య, కూతురు
Readmore >ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి
Readmore >అటెండర్తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్
Readmore >