Posted on 2024-02-19 20:23:53
ఫిర్యాదులు కు స్పందించిన ఎస్పీ
డైలీ భారత్, మెదక్:
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాల యంలో జిల్లా ఎస్.పి డా..బి.బాలస్వామి ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో శివాయపల్లి గ్రామానికి చెందిన ఉడుత శ్రీలత తనకు 2012 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకుందని పెళ్లి జరిగిన కొన్ని రోజులు బాగుండి తర్వాత నుండి నా భర్త కొట్టడం తిట్టడం మొదలు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆ భాధలు భరించక తన తల్లి గారి ఇంటికి వచ్చిన కూడా రోజు రాత్రి నా భర్త వచ్చి నన్ను నా కొడుకు మరియు మా అమ్మ నాన్న ను చంపుతానని ఇంట్లో ఉన్న సి సి కెమెరా, స్మార్ట్ ఫోన్ మరియు ఇతర సమానులను పగుల కొట్టినాడని, అతని వల్ల మాకు ప్రాణ భయం ఉందని కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని రామాయంపేట సి.ఐ. కి సూచనలు చేయటం జరిగింది. అలాగే సోమక్కపేట గ్రామానికి చెందిన రాదగొని మానస తన స్వంత స్థలం లో ఇంటి నిర్మాణం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు నిర్మాణం చేయనివ్వకుండా మేస్త్రిని అడ్డు కుంటున్నారని, వారిని బూతుమాటలు తిట్టి, కొడుతున్నారని, వారిని చంపుతామని బెదిరిస్తున్నారని కావున న్యాయం చేయాలని కోరగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని నర్సాపూర్ సి.ఐ. కి తగు సూచనలు చేయటం జరిగింది.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2024-05-15 19:01:12
Readmore >కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Posted On 2024-05-14 22:33:34
Readmore >ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి
Posted On 2024-05-14 20:54:19
Readmore >