Posted on 2023-11-07 18:56:17
17వ పోలీస్ బెటాలియన్ ను సందర్శించిన డి.ఐ.జి యమ్.యస్.సిద్దిఖీ .
డైలీ భారత్, సిరిసిల్ల : ఈ సందర్భంగా కమాండెంట్ యస్.శ్రీనివాస రావు డి.ఐ.జి యమ్.యస్.సిద్దిఖీ, టి.ఎస్.ఎస్.పి బెటాలియన్స్ గారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వచ్చిన డీ.ఐ.జీ సిద్ధిఖీ బెటాలియన్ లో విస్తృతంగా పర్యటించి పర్యవేక్షించారు. పరిపాలన ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి మినిస్టీరియల్ స్టాఫ్ కు సంబంధించిన విభాగాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బెటాలియన్ కు సంబంధించిన యూనిట్ హాస్పిటల్,మోటార్ ట్రాన్స్పోర్ట్, బెటాలియన్ వెల్ఫేర్ ఆఫీస్, క్వార్టర్ మాస్టర్ ఆఫీస్ వింగ్ ల యొక్క వివిధ రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన గాడ్ రూమును ప్రారంభించి కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు.నిర్మాణంలో ఉన్న పరిపాలన భవనాన్ని మరియు బెల్ ఆఫ్ ఆర్మ్స్ భవనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ వార్షిక తనిఖిలో భాగంగా డి.ఐ.జి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారని మరియు అధికారులు మరియు సిబ్బందితో ఇంటరాక్ట్ అవుతారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఎ. జయప్రకాష్ నారాయణ ,యమ్.పార్థసారథి రెడ్డి , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.శైలజ ,అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి
Posted On 2024-05-16 14:12:24
Readmore >భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య
Posted On 2024-05-16 09:54:06
Readmore >ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2024-05-15 19:01:12
Readmore >కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Posted On 2024-05-14 22:33:34
Readmore >