| Daily భారత్
Logo


నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలు ఎందుకు అమలు చేయలేరు : మంత్రి పొన్నం ప్రభాకర్

News

Posted on 2024-02-19 11:13:59

Share: Share


నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలు ఎందుకు అమలు చేయలేరు : మంత్రి పొన్నం ప్రభాకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎన్నికల హామీల విషయంలో బిఆర్ఎస్ పార్టీ బాగానే ఇబ్బంది పెట్టగలిగింది. కానీ పదేళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలను అమలు చేయలేనప్పుడు, నెల రోజులు కూడా కాక మునుపే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని హామీల గురించి నిలదీయడం చాలా తొందరపాటే కదా? కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బెదిరించడంతో కాంగ్రెస్‌ మంత్రులు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని బిఆర్ఎస్ మీద ఎదురుదాడి చేయగలిగారు. 

ముఖ్యంగా... కేసీఆర్‌ సభకు రాకుండా మొహం చాటేస్తుండటంతో బిఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్‌ మంత్రుల ముందు తలదించుకోవలసి వస్తోంది. ఈ నేపధ్యంలో శాసనసభలో కాంగ్రెస్‌ మంత్రులను ఎదుర్కోవడం బిఆర్ఎస్ సభ్యుల వల్ల కావడం లేదు. 

శుక్రవారం శాసనసభ సమావేశాలలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, “మేమే జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించాము. మేమే అందరికీ నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నామంటూ మీరు చెప్పుకోవడం, మా ప్రభుత్వం చేసిన పనులకు మీరు క్రెడిట్ తీసుకోవడం సరికాదు...” అని కడియం శ్రీహరి అన్నారు. 

సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందిస్తూ, “మేము, మా ముఖ్యమంత్రిగారు ఎవరూ కూడా జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చామని, మేమే పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పలేదు. మీరు మొదలుపెట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను రెండేళ్ళైనా పూర్తిచేయకుండా మద్యలో వదిలేసి దిగిపోతే, దానికి అవరోధంగా ఉన్న న్యాయపరమైన సమస్యలన్నిటినీ మేము పరిష్కరించి కేవలం రెండు నెలల్లోనే నియామక పత్రాలు ఇస్తున్నామని మాత్రమే చెప్తున్నాము. 

మీరు అధికారంలో ఉన్నప్పుడే ఉద్యోగాలు భర్తీ చేసి ఉండి ఉంటే నేడు మాకు ఈ అవకాశం లభించేది కాదు కదా? మీరు చేయలేక విడిచి పెట్టేసిన పనిని మేము పూర్తిచేసి చూపిస్తుంటే అభినందించాలి కానీ ఇలా విమర్శలు చేయడం తగదు. 

మా ప్రభుత్వం టిఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వబోతోంది. దాంతో  మేము ఏవిదంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామో మీరే చూస్తారు,” అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా బదులిచ్చారు.

Image 1

పిడుగుపాటుకు గురై ఒకరు మృతి

Posted On 2024-05-16 19:48:35

Readmore >
Image 1

ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి

Posted On 2024-05-16 19:23:17

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Posted On 2024-05-16 17:38:06

Readmore >
Image 1

ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి

Posted On 2024-05-16 14:12:24

Readmore >
Image 1

అలిపిరి వద్ద కారు దగ్ధం

Posted On 2024-05-16 13:34:02

Readmore >
Image 1

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

Posted On 2024-05-16 09:54:06

Readmore >
Image 1

నేడు తెలంగాణ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

Posted On 2024-05-16 09:07:38

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2024-05-15 19:01:12

Readmore >
Image 1

కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్

Posted On 2024-05-15 13:52:23

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా

Posted On 2024-05-15 13:42:59

Readmore >