డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నేడు ఎల్. బి నగర్ రింగ్గు రోడ్డు చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు...
ఈ సందర్బంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ...
భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధృవతార సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ అని కొనియాడారు...
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీ నాయకులు,యువజన నాయకులు, పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....